Sunday, May 5, 2024

Big Story: టీ20 వరల్డ్ కప్ టార్గెట్ .. రేపటి నుంచి మ్యాచ్ లు షురూ

ఐసీసీఈ పురుషుల టీ 20 ప్రపంచకప్‌కు ఇంకా ఒక్కరోజుమాత్రమే మిగిలి ఉంది. కప్పు కొట్టాలనే లక్ష్యంతో పలు దేశాలు పోటీలోకి దిగుతున్నాయి. అభిమానులను దాదాపు నెల రోజుల పాటు అలరించనున్నాయి. అయితే ఈ పోటీ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు 16 జట్లు 45 మ్యాచ్‌లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్‌ ఎ, బి నుంచి మొదటి జట్లు సూపర్‌ 12కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ఆరు గ్రూపులతో కూడిన రెండు గ్రూపులు రౌండ్‌ రాబిన్లో ఆడతాయి. మొదటి రెండు జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. టోర్నీలో గెలుపొందిన జట్టుకు 1.6 మిలియన్లు యూఎస్‌ డాలర్లను నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు నగదు బహుమతిని 8 లక్షల డాలర్లు అందిస్తారు. టోర్నీలో ఓడిపోయిన సెమీ ఫైనలిస్టులకు 4 లక్షల డాలర్లు అందిస్తారు. టీ 20 ప్రపంచకప్‌ 2022 ఆస్ట్రేలియాలోని ఏడునగరాల్లో జరుగుతుంది. 2007లో ఎమ్మెస్‌ ధోని నేతృత్వంలోని యువ భారత జట్టు ఆఖరి ఓవర్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఏడాది టోర్నీ మూడు దశల్లో జరుగనుంది. టోర్నమెంట్‌ మొదటి రౌండ్‌ క్వాలిఫైయర్లుగా ఉంటుంది. అందులో నుంచి నాలుగుజట్లు అంటే రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు సూపర్‌ 12కు అర్హత సాధిస్తాయి.

మొదటి రౌండ్‌ గ్రూప్‌ ఎ: నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
గ్రూప్‌ బి నుంచి మొదటి రెండు జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. నాకౌట్‌ దశలో రెండు సెమీ ఫైనల్‌లు, నవంబర్‌ 13న ఫైనల్‌ ఉంటుంది.

గ్రూప్‌ 1లో అప్గనిస్తాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ,న్యూజిలాండ్‌
గ్రూప్‌ ఎ విజేత, గ్రూప్‌ బి రన్నరప్‌, గ్రూప్‌ 2లో బంగ్లాదేశ్‌, ఇండియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా
గ్రూప్‌ బి విజేత గ్రూప్‌ ఎ రన్నరప్‌ ఉంటాయి. మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌, మెల్‌ బోర్న్‌ ఆడిలైడ్‌ వంటి ఓవల్‌, ఆడిలైడ్‌ ఓవల్‌, ఆడిలైడ్‌ సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌, సిడ్నీ గబ్బా, బ్రిస్బేన్‌ కార్డినియో పార్క్‌, గీలాంగ్‌ బెల్లెరివ్‌ ఓవల్‌, హోబర్ట్‌ పెర్త్‌ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతాయి.

- Advertisement -

నవంబర్‌ 13న ఫైనల్‌ టోర్నీ ఐకానిక్‌ మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతుంది. నాకౌట్‌ దశల్లో సెమీ ఫైనల్‌, ఫైనల్‌ రెండింటికీ రిజర్వ్‌ రోజులు ఉంటాయి. ఏ ఇతర మ్యాచ్‌లకూ రిజర్వ్‌ రోజులు లేవు. భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా- అక్టోబర్‌17 భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ అక్టోబర్‌ 19, భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ అక్టోబర్‌ 23, భారత్‌ వర్సెస్‌ రన్నరప్‌ (గ్రూప్‌ ఎ) అక్టోబర్‌ 27, భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా అక్టోబర్‌ 30, భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ నవంబర్‌ 2, ఆడిలైడ్‌ భారత్‌ వర్సెస్‌ విజేత గ్రూప్‌ బి నవంబర్‌ 6న జరుగుతాయి.

స్టార్‌ నెట్‌వర్క్‌, స్కై స్పోర్ట్‌ ్స, ఫాక్స్‌ స్పోర్ట్‌, ఈఎస్‌ పిఎన్‌ , పిటివి, టైమ్స్‌ ఇంటర్నెట్‌తో ప్రధాన ప్రసారకర్తలతో ఖండాంతరాలలో టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. భారత దేశం, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, మాల్దిdవులలో స్టార్‌ నెట్‌ వర్క్‌ టెలివిజన్‌ హక్కులను కలిగి ఉంది. హాట్‌ స్టార్‌ డిస్నీప్లస్‌ భారత దేశంలో గేమ్‌లను ప్రసారం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement