Sunday, May 5, 2024

రోహిత్‌ శర్మ, బాబర్‌ ఆజమ్‌ ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌

ఐసీసీ ఇన్‌ స్టాగ్రామ్‌లో ఇప్పుడో పోస్టు వైరల్‌వుతోంది. రోహిత్‌ శర్మ, బాబర్‌ ఆజమ్‌ ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యారు. టీ 20 వరల్డ్‌ కప్‌ సందర్బంగా శనివారం కెప్టెన్స్‌ డే ఈవెంట్‌ను ఆర్గనైజ్‌ చేశారు. మొత్తం 16 జట్ల కెప్టెన్‌లతో ఫోటో సెషన్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఇండియన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఆ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.. బాబర్‌, రోహిత్‌ శర్మ ఫోటోలతో ఐసీసీ తన ఇన్‌ స్టాలో ఓ రీల్‌ను పోస్ట్‌ చేసింది.. ఆ రీల్‌కు బ్యాక్‌ గ్రౌండ్‌ సౌండ్‌ కూడా ప్రెజెంట్‌ చేసింది. ఏంటీ, మనం ఇద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యామా అని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఐసీసీ షేర్‌ చేసిన ఆ పోస్టుకు విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement