Thursday, April 25, 2024

Breaking: నిర్మాత కాట్రగడ్డ మురారి ఇక లేరు.. చెన్నైలో కన్నుమూత

ప్రముఖ చిత్ర నిర్మాత కాట్రగడ్డ మురారి ఇక లేరు.. ఇవ్వాల (శనివారం) రాత్రి ఆయన చెన్నైలోని తన నీలాంగరై నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో సినీలోకం విషాదంలో ఉంది.. ఎన్నో సంచలనాత్మక సినిమాలు నిర్మించారు కాట్రగడ్డ. యువచిత్ర బ్యానర్​పై నిర్మించిన చాలా సినిమాలు విజయాలను సొంతం చేసకున్నాయి.

గోరింటాకు సహా పలు చిత్రాలకు కాట్రగడ్డ నిర్మాతగా ఉన్నారు. నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాస కల్యాణం వంటి హిట్​ మూవీస్​కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. కాట్రగడ్డ మురారి మరణ వార్త తెలిసిన సినీరంగ ప్రముఖులు చిరంజీవి సహా పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్​ కూడా మురారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement