Friday, May 3, 2024

YSRCP: మరో విజయయాత్రకు సిద్ధమవుతున్న జ‌గ‌న్ ?

ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌చారాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీల అధినేత‌లు, అభ్య‌ర్థులు ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తున్నారు.

ఈనెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కోసభ ఉంటుందని వారు వెల్లడించారు. ఈ సభల్లోనే 2024 వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్‌మ్యాప్‌కు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement