Tuesday, May 14, 2024

పాక్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్

న్యూజిలాండ్‌, పాక్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరగాల్సిన సరీస్ పూర్తి గా రద్దైంది. ఇవాళ పాక్‌ లోని రావల్పిండి స్టేడియం లో మొదటి వన్డే జరగాల్సి ఉన్నప్పటికి రద్దు అయింది. భద్రతా సమస్యల కారణంగా ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ రద్దు అయింది. అయితే.. మొదటి మ్యాచ్‌ రద్దు అయినట్లు ప్రకటించిన కొద్ది సేపటి క్రితమే.. పాక్‌ టూర్‌ ను కూడా పూర్తి గా రద్దు చేసుకుంటున్నట్లు.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు పేర్కొంది. భద్రతా సమస్యల నేపథ్యం లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు. కాగా… పాక్‌ – న్యూజిలాండ్‌ మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: నితిన్ సరసన నిధి అగర్వాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement