Monday, April 29, 2024

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు శారదక్క

మావోయిస్టు నేత బజ్జర సమ్మక్క అలియాస్‌ శారదక్క తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారదక్క.. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా గంగారం. 1994లో పీపుల్స్‌ వార్‌ పార్టీకి ఆమె ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల కరోనాతో శారదక్క భర్త హరిభూషణ్‌ చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement