Friday, April 26, 2024

IPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబ‌యి.. గెలుపుపై క‌న్నేసిన పంజాబ్‌

ముంబై ఇండియ‌న్స్, పంజాబ్ కింగ్స్ ఇవ్వాల రాత్రి జ‌రిగే మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, టాస్ గెలిచిన రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో ముంబ‌యి జోరు మీదుంది. మ‌రో వైపు ఓట‌మిచెందుతూ వ‌స్తున్న‌ పంజాబ్ గెల‌వాల‌న్న క‌సిగా ఉంది. ఆఖ‌రి మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళురు చేతిలో కంగుతిన్న పంజాబ్ గెలుపుపై క‌న్నేసింది. ఈ ఆస‌క్తిక‌ర పోరులో విజేత ఎవ‌రు? అనేది మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement