Wednesday, May 15, 2024

Asian games | టేబుల్‌ టెన్నిస్‌లో ప్రి-క్వార్టర్‌ ఫైనల్స్‌కు భారత్‌..

ఆసియా క్రీడల్లో భాగంగా శనివారం గోంగ్షు కెనాల్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ జిమ్నాసియంలో జరిగిన గ్రూప్‌ ఎఫ్‌ మ్యాచ్‌లలో భారత పురుషుల, మహిళల టేబుల్‌ టెన్నిస్‌ జట్లు ప్రి-క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈరెండు జట్లు వరుసగా నేపాల్‌, తజకిస్తాన్‌పై 3-0తో విజయం సాధించాయి. భారత మహిళలు ఆల్‌విన్‌ రికార్డుతో తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్నారు.

యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినప్పటికీ, భారత ఆటగాళ్లు మూడు టైల్లోనూ వరుస గేమ్‌ల్లో విజయం సాధించారు. ఇంతకుముందు యెమెన్‌, సింగపూర్‌లను ఓడించిన భారత పురుషుల జట్టు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తజకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మానవ్‌ థాకర్‌ 11-8, 11-5, 11-8తో మహ్ముదోవ్‌ను ఓడించి శుభారంభం అందించాడు.

ఆ తర్వాత మనుష్‌షా 13-11, 11-7, 11-5తో ఉబైదుల్లో సుల్తోనోవ్‌పై విజయం సాధించగా, ఇబ్రోకిమ్‌ ఇస్మోయిల్జోడాపై 11-1, 11-3, 11-5 సులభమైన విజయంతో హర్మీత్‌ దేశాయ్‌ భారత్‌ రికార్డును మరింత మెరుగుపరిచాడు. మహిళల విభాగంలో, టాప్‌ స్టార్‌ మానికా బాత్రా విశ్రాంతి తీసుకున్నప్పటికీ మహిళల జట్టు సునాయాస విజయాలు సాధించింది.

- Advertisement -

మొదట దియా చితాలే 11-1, 11-6, 11-8తో సిక్కా శ్రేష్ఠపై గెలుపొందగా, ఐహకా ముఖర్జీ 11-3, 11-7, 11-2తో నబితా శ్రేష్ఠపై విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 11-1, 11-5, 11-2తో ఇవానా మగర్‌ థాపాపై విజయం సాధించి భారత్‌కు శుభారంభం అందించింది. ఆదివారం జరిగే ప్రిక్వార్టర్‌ఫైనల్స్‌లో భారత పురుషులు కజకిస్తాన్‌తో ఆడతారు, ఆదివారం జరిగే మరో రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లో మహిళలు థాయ్‌లాండ్‌తో తలపడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement