Monday, April 29, 2024

Trolling – ఇంత నీచంగా, దిగ‌జారి ట్రోలింగా….పెళ్లి వార్త‌ల‌పై సాయి ప‌ల్ల‌వి మ‌న‌స్థాపం..

ఈ సోషల్‌ మీడియా కాలంలో వ్యూస్‌ కోసం, న్యూస్‌ కోసం లేనిపోనివి సృష్టించి రాయడం పరిపాటైపోయింది. ఇలాంటి వార్తల వల్ల మనస్తాపానికి గురైన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారిలో సాయిపల్లవి కూడా చేరింది. తమిళదర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామితో సాయిపల్లవి ఉన్న ఫొటోను కొందరు నెటిజన్స్‌ బాగా ట్రోల్‌ చేస్తున్నారు. పూలదండలు మెడలో వేసుకొని పక్కపక్కనే నిలబడ్డ వారిద్దరి ఫొటోను పోస్ట్‌ చేసి ‘సాయిపల్లవి పెళ్లయిపోయింది ఇదిగో సాక్ష్యం.. ఇంతకీ ఆ పెళ్లికొడుకు ఎవరో తెలుసా?’ అంటూ క్యాప్షన్లు పెట్టారు.

ఈ ఫొటో, రూమర్లు చివరికి సాయిపల్లవి ఇంట్లోకి కూడా వెళ్లిపోయాయి. ఆమె తల్లిదండ్రులు కూడా ఈ రూమర్ల వల్ల మనస్తాపానికి లోనయ్యారని సాయిపల్లవి తెలిపింది. తనపై వచ్చే ఏ రూమర్నీ పట్టించుకోని సాయిపల్లవి, తొలిసారి ఈ రూమర్‌పై ట్విటర్‌ ద్వారా స్పందించింది. “ రూమర్లను నేను పట్టించుకోను. కానీ కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా బాధపడేంత నీచంగా పుకార్లను సృష్టిస్తుంటే తప్పక స్పందిస్తున్నా. నేను నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ గ్రూప్‌ ఫొటోను క్రాప్‌ చేసి, దాని అర్థమే మార్చేసి, పెళ్లంటూ ప్రచారం చేయటం నీచమైన చర్య. నా సినిమా అప్‌డేట్స్‌ గురించి మాట్లాడాల్సిన సందర్భంలో ఇలాంటి నీచమైన విషయం గురించి మాట్లాడాల్సిరావడం బాధగా ఉంది” అంటూ వాపోయారు సాయిపల్లవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement