Wednesday, May 15, 2024

బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎస్‌బీఐ లైఫ్‌

భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) స్పాన్సర్‌షిప్‌కి సంబంధించి మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు టైటిల్‌ స్పాన్సర్‌ హక్కులను కట్టబెట్టిన బీసీసీఐ, తాజాగా అధికారిక స్పాన్సర్‌గా ఎస్‌బీఐ లైఫ్‌కి హక్కులు దఖలుపరిచింది. మూడేళ్ల కాలానికి (2023-2026) బీసీసీఐ, ఎస్‌బీఐ లైఫ్‌ మధ్య రూ.47 కోట్ల ఒప్పందం కుదిరింది. భారత జట్టు ఆడబోయే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎస్‌బిఐ లైఫ్‌ అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.85 లక్షలు బీసీసీఐకి చెల్లిస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఎంపికైన ఎస్‌బీఐ లైఫ్‌కు స్వాగతం. ఈ మూడేళ్లలో (56మ్యాచ్‌లు) వరల్డ్‌ కప్‌తో పాటు వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌ టోర్నీల్లో టీమిండియా అఫీషియల్‌ స్పాన్సర్‌గా వ్యవ#హరించనుంది అని ఓ ప్రకటనలో జైషా తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement