Wednesday, May 8, 2024

శంకర్పల్లి మండలం లో రోడ్డు ప్రమాదంలో ఒక‌రు దుర్మ‌ర‌ణం

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి (ప్రభ న్యూస్) శంకరపల్లి మండల పరిధిలోని పర్వేద సరిహద్దులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏర్వగుడ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీశైలం తండ్రి అడివయ్య అక్కడికక్కడే మృతి చెందాడు, స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, ఏర్వగూడ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీశైలం శంకరపల్లి లో పనులు పూర్తిచేసుకుని స్కూటీపై తిరుగు ప్రయాణంలో ఏర్వగుడ మలుపు దగ్గరలో వైల్డ్ వాటర్ నుండి బయటకు వచ్చిన కారు వేగంగా స్కూటీని గట్టిగా ఢీకొట్టడంతో ముత్తంగి శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదువుతూ ఉన్నారని తెలిసింది సంఘటనా స్థలానికి శంకరపల్లి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement