Tuesday, May 14, 2024

Cricket: సెంచరీతో ఆక‌ట్టుకున్న కోహ్లీ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానుల సందడి

స్టార్ బ్యాటర్ కోహ్లీ ఇవ్వాల అఫ్గాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. 6 సిక్సులు, 12 ఫోర్ల‌తో అభిమానుల‌ను అల‌రంచాడు. ఫామ్‌లోకి వస్తున్న ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లంతా టెస్టు క్రికెట్‌లో సెంచరీలు చేస్తుంటే.. విరాట్ తన రూటే సపరేటు అని మరోసారి నిరూపించాడు. నెలరోజుల విశ్రాంతి తర్వాత అదిరిపోయే ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన కోహ్లీ.. అప్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడేళ్ల పాటు అతని సెంచరీ కోసం ఎదురు చూసిన అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు. రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ సెంచరీ (122 నాటౌట్)తో అదరగొట్టాడు.

ఇక‌.. రాహుల్ (62)తో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించిన అతను.. ఆ తర్వాత పంత్ (20 నాటౌట్)ను ఒక ఎండ్‌లో నిలబెట్టి మరో ఎండ్‌లో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో నెట్టింట కోహ్లీ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement