Saturday, May 4, 2024

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ ధోనికే..

ఐపిల్‌ 2023 సీజన్‌లో జట్టు కెప్టెన్‌ గా ఎంఎస్‌ ధోనినే కొనసాగుతాడనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) సీఈఓ కాశీ విశ్వనాథ్‌ ఆదివారం స్పష్టం చేశారు. సిఎస్‌కేను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోనిపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతని సారథ్యంలోనే సీఎస్‌కే మరోసారి బరిలో నిలువనుందని కాశీవిశ్వనాథ్‌ వెల్లడించాడు.

కాగా 2022 ఐపిఎల్‌ సీజన్‌కు ముందు సీఎస్‌కే తొలిసారి కెప్టెన్‌ను మార్చిన విషయం తెలిసిందే. ధోని ఇష్టపూర్వకంగా సారథ ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజాను కెప్టెన్సీ వరించింది. అయితే జడేజా కెప్టెన్సీ భారాన్ని హ్యాండిల్‌ చేయలేకపోవడంతో యాజమాన్యం తిరిగి ధోనినే జట్టు భారం మోయాల్సిందిగా కోరింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోని మరోసారి సీఎస్‌కే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అప్పటికే గత సీజన్‌లో సీఎస్‌కేకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి మ్యాచ్‌ల్లో ధోని కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ సీఎస్‌కే తొమ్మిదో స్థానంలో సరిపెట్టుకోవల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement