Sunday, May 12, 2024

సాఫ్ట్ సిగ్నల్ ఇక పై ఉండదా..?

క్రికెట్ లో కొంత కాలంగా అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఈ వివాదం కొనసాగుతోంది ఇప్పుడు ఈ విషయంపై బీసీసీఐ ఓ కీలక నిర్ణయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఆటగాళ్లు అవుటా? నాటవుటా? అన్న విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం, అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ పై చర్చ సాగుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 9 నుంచి జరగనున్న ఐపీఎల్ లో ఫీల్డ్ లో ఉండే అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ను పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. ఐపీఎల్ నిబంధనల్లోని అపెండిక్స్ డీ-క్లాస్ 2.2.2 ప్రకారం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. టీ-20 సిరీస్ లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ లో ఇటువంటి తప్పులు చోటు చేసుకోకుండా చూడాలని భావించిన బీసీసీఐ, ఫీల్డ్ అంపైర్ తో సంబంధం లేకుండా, తనకు రిఫర్ చేసిన బాల్స్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement