Sunday, May 12, 2024

వ్యాక్సినేషన్‌ కార్యక్రమం..

మార్కాపురంటౌన్‌ : ఈనెల 29వ తేదీ పట్టణంలోని 11, 19 సచివాలయాల పరిధిలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని వైద్యాధికారి డా. రాహుల్‌ తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ 11వ సచివాలయం తోటవారివీధి అంగన్‌వాడి కేంద్రం, 19వ సచివాలయం జవహర్‌నగర్‌ కాలనీలోని వెంకటేశ్వర స్కూల్‌ నందు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 -49 సం.లోపు దీర్ఘకాలిక వ్యాధులు కలవారు, 60 సం.ల పైబడిన వారు అర్హులని తెలిపారు. ఆధార్‌కార్డు, తత్సమాన గుర్తింపు కార్డు తీసుకునిరావాలని తెలిపారు. ఎఎన్‌ఎమ్‌, ఉషా, అంగన్‌వాడి కార్యకర్తలు నేడు,రేపు పట్టణ ప్రజలకు ముఖ్యంగా 11, 19 సచివాలయ పరిధిలోని ప్రజలకు తెలియజేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎఎన్‌ఎమ్‌లను, ఉషాలను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ విద్యాసాగరుడు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement