Saturday, April 27, 2024

అయ్యో.. అయ్యయ్యో.. ప్రాణం తీసిన డంబెల్స్

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం చోటు చేసుకుంది. వ్యాయామం చేస్తుండగా డంబెల్స్‌ మీదపడి యువకుడు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ఫిరోజ్‌ (19) స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. అతడి నిత్యం ఉదయం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తూ డంబెల్స్‌ మీదపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement