Friday, May 10, 2024

వార్తల్లోకి మరోసారి కంగన…గాంధీ భార్యను కూడా ఈ సారి!!

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కంగనా రనౌత్‌ ఇటీవల సుశాంత్ ఆత్మహత్య తరువాత ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల నిరసనను వ్యతిరేకిస్తూ కంగనా చేసిన ట్వీట్లు వివాస్పదంగా మారాయి. అంతే కాదు ఆమెపై కేసులు కూడా నమోదైందయ్యాయి.

తాజాగా కంగనా జాతిపితను టార్గెట్‌ చేస్తూ… మహాత్మాగాంధీని విమర్శిస్తూ ట్విటర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. గాంధీ తన భార్య, బిడ్డలను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతిథుల టాయ్‌లెట్ల‌ను శుభ్రం చేయ‌లేద‌ని త‌న భార్య‌ను ఆయ‌న ఇంటి నుంచి గెంటేసారు. ఇన్ని అవ‌ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తిని ఒక దేశం క్ష‌మించింద‌ని, అత‌ను భ‌ర్త‌గా క‌రెక్ట్ గా లేకున్న‌ప్ప‌టికీ మ‌గాడు కాబ‌ట్టే ఆమె కూడా క్ష‌మించ‌గ‌లిగింద‌ని అన్నారు. ఇక కంగన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement