Saturday, April 27, 2024

అశోక్‌గజపతిపై విజయసాయిరెడ్డి కొత్త ఆరోపణలు

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి ఆరోప‌ణ‌లు గుప్పించారు. 2017లో విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదం అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాని మోదీకి లేఖ రాశాన‌ని ఆయన పేర్కొన్నారు.

2017లో విజయనగరం వద్ద హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో 42 మంది మృతి చెందారని.. ఈ ఘటనపై విచారణ సక్రమంగా జరగకుండా అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ప్రభావితం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై అత్యున్నత విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి లేఖ రాయడం జరిగిందని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement