Friday, April 26, 2024

శ్రీలంక జట్టు కెప్టెన్, కోచ్ మధ్య వాగ్వివాదం..

శ్రీలంకతో జ‌రిగుతున్న 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయిన శ్రీలంక టీమ్ రెండవ మ్యాచ్ కి వచ్చే సరికి కసిగా బరిలోకి దిగారు.. మొదట బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన ఆతిథ్య జట్టు బౌలింగ్ లో అదరగొట్టింది… క్రమం తప్పకుండా టీమిండియా వికెట్లు తీసి మనోళ్లను ఒత్తిడిలోకి నెట్టారు.. అయితే లంకకు శార్దుల్ ఠాకూర్ రూపంలో గండం ఎదురైంది…అయితే చివర్లో శ్రీ‌లంక ఆట‌గాళ్లు మ్యాచుపై ప‌ట్టు కోల్పోతోన్న స‌మయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో ఊగిపోయిన ఆర్థ‌ర్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మ్యాచ్‌ చివరి ఓవ‌ర్ల స‌మ‌యంలో ఆర్థర్  మైదానంలోకి వచ్చి కెప్టెన్‌ షనకతో మాట్లాడారు. అదే స‌మ‌యంలో షనక కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మధ్య  వాగ్వివాదం చోటు చేసుకుంది. ఫుట్ బాట కోచ్ తరహాలో కెప్టెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, మ్యాచ్‌ జరుగుతోన్న స‌మ‌యంలో కోచ్ ను మైదానంలోకి ఎందుకు రానిచ్చార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/cric12222/status/1417562676998205440

ఇది కూడా చదవండి : హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరో పేరు!

Advertisement

తాజా వార్తలు

Advertisement