Sunday, May 19, 2024

పురుషులతో సమానంగా మహిళల మ్యాచ్ ఫీజు.. ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు

మహిళల మల్టీ-ఫార్మాట్ లో ఇంగ్లాండ్ జ‌ట్టు స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. స్టేడియంలో రికార్డు స్థాయిలో ప్రేక్షకులను ఆక‌ట్టుకోగ‌లిగింది ఇంగ్లాండ్ మహిళల జ‌ట్టు. విజయవంతమైన మహిళల మల్టీ-ఫార్మాట్ యాషెస్ సిరీస్ తర్వాత.. స్టేడియంలో రికార్డు స్థాయిలో జనం రావడంతో, పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్లు ECB ప్రకటించింది.

ఈ వేసవి మహిళల యాషెస్ సిరీస్‌లో రికార్డు స్థాయిలో 110,000 మంది ప్రేక్షకులు రావడంతో, ఇంగ్లండ్ పురుషుల మ్యాచ్ ఫీజులకు అనుగుణంగా ఇంగ్లాండ్ మహిళలకు మ్యాచ్ ఫీజులను పెంచుతున్నట్లు ECB ఈరోజు ప్రకటించింది. ఎడ్జ్‌బాస్టన్, ది ఓవల్ & లార్డ్స్‌లలో ఇంగ్లండ్ కొత్త మహిళల అంతర్జాతీయ హాజరు రికార్డులను నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్‌లో టౌంటన్, బ్రిస్టల్ మరియు హాంప్‌షైర్‌లలో జరిగిన మ్యాచ్‌ల టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement