Friday, May 17, 2024

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి..కేసిఆర్ మాస్కు ధరించి రాఖీ కడుతూ నిరసన!

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా మహిళా ఉద్యోగినులు… కెసిఆర్ మాస్క్ ధరించిన ఉద్యోగులకు రాఖీ కడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అన్నగా కేసీఆర్ రాఖీ పండుగ కానుకగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి సమస్యలను పరిష్కరిం చాలని మహిళా ఉద్యోగినులు కోరారు.

ప్రధానంగా రాష్ట్రం లోని సమగ్ర శిక్ష ఉద్యోగులం దరినీ రెగ్యుల రైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయ పరమైన డిమాండ్లను ప్రభు త్వం తక్షణమే నెరవేర్చాలం టూ జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్ లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యం లో చేపట్టిన రిలే నిరాహార దీక్ష లు బుధవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement