భార్యల మార్పిడి (స్వాపింగ్ వైఫ్) గేమ్ ఆడడానికి ఒప్పుకోలేదని భార్యపై ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశాడు. రాజస్థాన్లోని బికనేర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మర్ అనే వ్యక్తి బికనేర్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన భార్యను హోటల్కు తీసుకొచ్చి ఆమె వద్దనున్న సెల్ఫోన్ లాక్కుని గదిలో బంధించాడు. భార్యల మార్పిడి గేమ్ ఆడాలని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దాడి చేశాడు.
అయితే.. అక్కడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకొని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అమ్మర్కు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అంతేకాకుండా 50 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని తన అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయం మీద సీరియస్గానే దర్యాప్తు చేపట్టారు.