Wednesday, May 8, 2024

టీడీపీ, వైసీపీ నేతల మధ్య ‘రచ్చ’

విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ తొలి సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-వైసీపీ సభ్యులు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో స్పల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సమావేశంలో 30 వార్డుల సమస్యలపై చర్చించకుండా.. కేవలం రెండు వార్డుల సమస్యలను మాత్రమే చర్చిస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపణలకు దిగారు. దీనికి వైసీపీ సభ్యులు ప్రతిదాడి చేయడంతో సమావేశం గందరగోళంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు మున్సిపల్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement