Saturday, May 4, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ‌..అన‌న్య‌ల‌ను దీవించిన -విజ‌య్ త‌ల్లి మాధ‌వి

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నివాసంలో ప్ర‌త్యేక‌పూజ జ‌రిగింది.ఈ పూజ‌లో లైగ‌ర్ హీరోయిన్ అన‌న్య‌పాండేతో పాల్గొన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నాడు.స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘లైగర్’. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్టు 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, హిందీలో రూపొందించగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

ఆ చిత్రంలో న‌టిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌పాండే ప్ర‌స్తుతం ఆ ఫిల్మ్ ప్ర‌మోష‌న్‌లో ఉన్నారు. ఇండియా మొత్తం టూర్ చేస్తున్న ఈజంట‌.. తాజాగా వరంగ‌ల్ కూడా వెళ్లింది. అయితే బుధ‌వారం అన‌న్య పాండే హైద‌రాబాద్‌లో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంటికి వెళ్లింది. అక్క‌డ లైగ‌ర్ పార్ట్న‌ర్ అన‌న్య‌కు విజ‌య్ త‌ల్లి మాధవి స్వాగ‌తం ప‌లికింది. ఇంటికి వ‌చ్చిన సంద‌ర్భంగా పూజారుల‌తో పూజ‌లు చేయించింది. దీనికి సంబంధించిన ఫోటోల‌ను అన‌న్య త‌న ఇన్‌స్టాలో అప్‌డేట్ చేసింది. విజ‌య్ వాళ్ల అమ్మ దీవించిన‌ట్లు దానికి ట్యాగ్‌లైన్ ఇచ్చింది లైగ‌ర్ బ్యూటీ. థ్యాంకూ ఆంటీ అని తెలిపింది. క్రేజీగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తూ ఈ చిత్రంపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement