Sunday, May 5, 2024

పేద వైశ్యునికి సీఎం సహాయనిది నుండి LOC – అందచేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్ లోని చింగిచెర్లకు చెందిన కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారి బి. రామకృష్ణ కూతురు సహస్రకు గత10 సంవత్సరాల నుండి కీళ్ళ నొప్పులు .. పెరుగుదల, జీర్ణ వ్యాధితో బాధపడుతోంది. దాంతో ఆమె ఆరోగ్య ఖర్చులకు ప్రతి నెల 20 వేల రూపాయలు అవుతున్నాయి. దాంతో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ద్వారా అక్షరాల 2 లక్షల రూపాయలను నాగోల్ లోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త LOC ఇప్పించారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ..వీరి కుమారునికి జార్ఖండ్ లో సైనిక్ స్కూల్ తిలైయాలో చదువుతున్న ఉన్నత చదువుల నిమిత్తం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరుపున గతంలో 40 వేల రూపాయలు ఇచ్చామ‌న్నారు. ఈ రోజు కూడా 10 వేల రూపాయలను చెక్కు రూపంలో ఇచ్చారు.కేసీఆర్ సీఎం అయిన తర్వాత పేదప్రజలకు ఏ ఆపద వచ్చిన నేను ఉన్న అనే విధంగా CMRF, LOC రూపంలో అదుకొని వీరికి సహాయం చేస్తున్నారు.గత ప్రభుత్వాలు పేద ప్రజలను పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రస్తుతం పేద వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యునిగా కష్టాలను పంచుకుంటూ అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని ముక్తకంఠంతో చెప్పొచ్చ‌న్నారు.అమ్మాయి తండ్రి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నా కూతురుకి ఆరోగ్య ఖర్చులకు LOC ద్వారా ఇప్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త కి ప్రత్యేక అభినందనాలు, ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement