Friday, April 26, 2024

కృష్ణాన‌ది పాయ‌లో రెండు గుర్తు తెలియని మృతదేహాల కలకలం

కృష్ణానది పాయలో మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. పామర్రు, పమిడిముక్కల మండలం, లంకపల్లి కృష్ణానది పాయలో ఇసుక తెన్నేల్లో గుర్తుపట్టలేని స్థితిలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతి చెంది చాలా రోజులు అయ్యి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. అస్తిపంజరాలుగా మారిన మృతదేహాలను ఇసుక తెన్నేల్లో నుంచి బ‌య‌ట‌కు తీశారు. మృతులు 45 రోజులలోపు మరణించినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వరద నీటిలో కోట్టుకు వచ్చాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పమిడిముక్కల పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement