Wednesday, May 8, 2024

మంటలు ఎలా వచ్చాయి… ఆడుకుంటున్నచిన్నారులు అగ్నికి ఆహుతి

గడ్డివాము పక్కన ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నవాబుపేట మండలం ఇప్పటూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రతిరోజు చిన్నారులు గ‌డ్డివాము వ‌ద్ద ఆడుకుంటు ఉంటారు. ప్రతిరోజులానే ఈ రోజు కూడా పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఆ సమయంలో గ‌డ్డివాము వ‌ద్ద ఉన్న చిన్నారులు సజీవ దహనం అయ్యారు. అయితే అక్క‌డికి మంట‌లు ఎలా వ‌చ్చాయి… ఎవ‌రైనా కావాల‌ని నిప్పు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్ర‌మాద‌వ‌శాత్తు మంట‌లు వ‌చ్చాయా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తగిలించారా అనేది తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement