Friday, April 26, 2024

అరుదైన ఘటన: కవల పిల్లలకు జన్మినిచ్చిన ఏనుగు!

శ్రీలంకలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 80 ఏళ్ళ తర్వాత ఓ ఏనుగు మగ కవలలకు జన్మనిచ్చింది. ఏనుగుల అనాథ ఆశ్రమంలో మంగళవారం రెండు మగ ఏనుగు పిల్లలు పుట్టాయి. సురంజి అనే 25 ఏళ్ల ఆడ ఏనుగు మగ కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి ఏనుగుతోపాటు రెండు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయని పిన్నవాలా ఏనుగుల అనాథ ఆశ్రమ నిర్వహకులు తెలిపారు. 2009లో ఒక మగ ఏనుగు పిల్లకు జన్మనిచ్చిన సురంజి.. ఇప్పుడు రెండో సారి రెండు మగ ఏనుగు పిల్లలకు జన్మనిచ్చిందని వివరించారు. 1941లో తొలిసారిగా ఒక ఏనుగు కవల పిల్లలను జన్మనివ్వగా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఈ అరుదైన సంఘటన జరిగిందని ఏనుగుల నిపుణుడు జయంత జయవర్దనే తెలిపారు. వైల్డ్‌ లైఫ్‌ అధికారిక రికార్డుల ప్రకారం శ్రీలంకలో 200 పెంపుడు ఏనుగులు, 7 వేల అడవి ఏనుగులు ఉన్నట్టు వెల్లడించారు. శ్రీలంకలో కొందరు తమ గొప్పదనాన్ని ప్రదర్శించుకోడానికి ఏనుగులను పెంచుకుంటారు. ఏనుగులను హింసించే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించే విధంగా శ్రీలంకలో చట్టాలు అమల్లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణ జలియన్‌ వాలాబాగ్‌.. అక్కడేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement