Saturday, April 27, 2024

Tirupathi – నేడే ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ వేడుక – శ్రీవారి సేవలో ప్రభాస్‌

తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ సందడి మొదలైంది. ఈ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది..

ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ఉదయం హీరో ప్రభాస్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్ర యూనిట్‌తో సహా.. సుప్రభాత సేవలో దర్శించుకున్నారు.. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. ప్రభాస్‌ను ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

- Advertisement -

. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ వద్ద, మహా ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో భక్తులను పోలీసులు విజిలెన్స్‌ అదుపు చేయలేకపోయింది. దీంతో అతి కష్టం మీద ప్రభాస్ ను ఆలయం ముందు నుంచి రాంభాఘీచ గేట్ వరకు తీసుకొచ్చి పోలీసులు కారులో పంపించారు. అనంతరం అక్కడి నుంచి ప్రభాస్‌ గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు. ఇక ప్రభాస్‌ బస చేసిన గెస్ట్‌ వద్ద కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement