Saturday, April 20, 2024

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు ఎపి వాసులు దుర్మరణం

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు

కాగా, మృతులను నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా గుర్తించారు. కలబురిగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్లొస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు మునీర్‌ (40), నయామత్‌ (40), రమీజా బేగం (50), ముద్దత్‌ షీర్‌ (12), సుమ్మి (13) గా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement