Thursday, May 2, 2024

Rajasthan: ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

ఓ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుని, ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడిన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సికర్‌లోని కథు శ్యామ్ జీ ఆలయంలో ఈ ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం జైపూర్‌కు తరలించారు. ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే ఒక్కసారిగా తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఓ మహిళ పడిపోయింది. ఆమెతో పాటు మరికొందరు కిందపడటం వల్ల తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయారు.

ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. శ్రావణ ఏకాదశి కావడంతో కథు శ్యామ్ మందిరానికి భక్తులు పోటెత్తారు. కృష్ణుడి అవతారంగా భావించే స్వామిని ఈ రోజున దర్శించుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు.. ముఖ ద్వారం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement