Friday, May 17, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఐదురుగు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఐదుగురు తిరిగిరానిలోకాలకు వెళ్లారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన ఐదుగురు కారులో తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో వారి కారు అదుపుతప్పి లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను అనిమిరెడ్డి, గురవమ్మ, అనంతమ్మ, ఆదిలక్ష్మి, నాగిరెడ్డిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement