Saturday, April 27, 2024

ఫుడ్ డెలివ‌రి బాయ్ గా ధ‌నుశ్ – ఆక‌ట్టుకుంటోన్న తిరుచిత్రం ట్రైల‌ర్

ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ జ‌వ‌హ‌ర్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం తిరు. ఈ చిత్రంలో త‌మిళ హీరో ధ‌నుశ్ న‌టిస్తున్నాడు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించారు. ధ‌నుష్‌కు జోడీగా రాశీఖ‌న్నా, ప్రియా భ‌వాని శంక‌ర్ న‌టించగా.. కీల‌క‌పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టించింది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు. తాజాగా చిత్ర‌బృందం ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. రేయ్ పండు నీ ఆర్డ‌ర్ రెడీ అయ్యింది. ఎంత‌సేప‌టి నుండి పిల‌వాలి. వ‌చ్చి తీసుకెళ్ళు’ అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ప్ర‌కాష్‌రాజ్, ధ‌నుష్ తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ‘వ‌చ్చాడు ఘ‌ర్ష‌ణ వెంక‌టేష్ ఈయ‌నొక్క‌డే ఈ లోకాన్ని కాపాడ‌తాడు’ అంటూ ప్ర‌కాష్‌రాజ్‌పై వేసే పంచులు అల‌రిస్తున్నాయి. చాలా కాలం త‌ర్వాత ఫ్రెండ్‌షిప్ ట్రాక్ బాగా కుదిరిన‌ట్లు ధ‌నుష్, నిత్యామీన‌న్ సీన్లు చూస్తుంటే తెలుస్తుంది. ట్రైల‌ర్‌ చివ‌రిలో ఇప్పుడు ‘ఈయ‌న ఏం చేస్తాడు. బాధ‌తో ఇళ‌యరాజా పాట‌లు వింటుంటాడు’ అంటూ నిత్యామీన‌న్ డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది.ఈ చిత్రం ఆగ‌స్ట్ 18న విడుద‌ల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement