Thursday, May 16, 2024

TS | సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్..

సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్‌ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. గత ఏడాది మార్చి 18వ తేదీన పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ సెలక్షన్ బోర్డ్ సీఎండీ పోస్ట్ కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది.

గతేడాది మార్చి 18న పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సీఎండీ పోస్టుల కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది. వీరిలో సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్‌ను పీఈఎస్‌బీ నియమించింది. అయితే శ్రీధర్‌పై అనేక అవినీతి ఫిర్యాదులు సివిసికి చేరడంతో ఎన్‌ఎన్‌డిసి సిఎండిగా శ్రీధర్ పగ్గాలు చేపట్టకుండా బొగ్గు మంత్రిత్వ శాఖ అడ్డుకుంది. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతిపాదనను అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ తిరస్కరించింది. ఎన్ఎండీసీ కొత్త సీఎండీ ఎంపిక కోసం ప్రక్రియను ప్రారంభించాలని స్టీల్ మినిస్ట్రీ సింగరేణిని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement