Sunday, April 28, 2024

అప్పా టు మన్నెగూడ హైవే విస్తరణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ శివార్లలోని అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు వరుసల జాతీయ రహదారికి టెండర్ల ప్రక్రియ పూర్తైంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నఈ హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కోట్‌పల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, ఎంసీ వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్, సర్పంచ్ రామచందర్, ఎంపీటీసీ రాజు అంబిక తదితరులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రవాణా, రోడ్లు, జాతీయ మంత్రిత్వ శాఖ చీఫ్ సెక్రటరీ మహావీర్ సింగ్‌ను కలిశారు. ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి టెండర్ల ప్రక్రియ పూర్తైందని వారు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement