Thursday, March 28, 2024

దేవాలయాలకు టూరిస్ట్ ప్యాకేజీలు

తిరుప‌తి, శ్రీ‌కాళ‌హ‌స్తి, శీశైలం త‌దిత‌ర దేవాల‌యాల‌కు రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ప్యాకేజీలను రూపొందించాలని అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధ కోరారు. మంగళవారం లోక్‌స‌భ‌లో రైల్వే శాఖ ప‌ద్దుల‌పై చ‌ర్చ‌లో ఆమె పాల్గొన్నారు. ఏపీలో ఆర్‌వోబీ, ఆర్‌యుబీల‌ను వేగంగా పూర్తి చేయాలన్నారు.

ద‌క్షిణ కోస్తా జోన్‌లో వాల్తేర్ డివిజ‌న్ ఉంచాలని డిమాడం చేశారు. జోన్ ఆప‌రేష‌న్‌లో తీవ్ర జాప్యం జ‌రుగుతోందని, కోటిప‌ల్లి- న‌ర్సాపూర్ రైల్వే లైన్ త్వ‌ర‌గా పూర్తి చేయాలని అనురాధ రైల్వే మంత్రికి వినతి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement