Sunday, May 12, 2024

తగ్గేదే లే అంటున్న కరోనా.. తెలంగాణలో కొత్తగా 8,126 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,126 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నాడు హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. శనివారం ఒక్కరోజే కరోనాతో 38 మంది ప్రాణాలు విడిచినట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 1,08,602 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వివరించింది. ప్రస్తుతం తెలంగాణలో 69,929 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. శనివారం కరోనా నుంచి 3,307 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,259, మేడ్చల్‌లో 676, రంగారెడ్డిలో 591, నిజామాబాద్‌లో 497, ఖమ్మంలో 339, మహబూబ్‌నగర్‌లో 306 కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement