Wednesday, May 8, 2024

తెలంగాణలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,00,677 కరోనా టెస్టులు నిర్వహించగా.. 2,982 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. కొత్తగా 21 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 3,427కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా 3,837 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 90.8 శాతంగా ఉండగా.. తెలంగాణలో 93 శాతంగా ఉందని పేర్కొంది. మరణాల రేటు సైతం జాతీయ సగటు 1.2 శాతంతో పోలిస్తే తెలంగాణలో 0.56 శాతం ఉందని తెలిపింది. కాగా కొత్తగా నమోదైన కేసులో జీహెచ్ఎంసీలో 436 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement