Thursday, May 16, 2024

కరోనా కారణంగా మరో భారత క్రికెటర్ నివాసంలో విషాదం

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎందరో ప్రముఖులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తన తండ్రి చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నానని ఆర్పీ సింగ్ చెప్పాడు. కరోనాతో పోరాటం చేస్తూ ఈరోజు తుదిశ్వాస విడిచారని తెలిపాడు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని అందరినీ కోరుతున్నానని చెప్పాడు. కాగా ఆర్పీ సింగ్ తండ్రి మృతి పట్ల పలువురు క్రికెట్లరు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఎంతో బాధ కలుగుతోందని సురేష్ రైనా అన్నాడు. ఈ కష్ట కాలంలో ధైర్యంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గిబ్స్ ధైర్యం చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement