Monday, April 29, 2024

ప్లాంట్ కోసం ప్రాణ త్యాగాలొద్దు

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు ప్రాణ త్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. కేసుల మాఫీ కోసం సీఎం జగన్ కేంద్ర పెద్దల కాళ్ల మీద పడటం వలనే.. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ చూస్తే బాధేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఏం చేసేందుకైనా టీడీపీ సిద్ధంగా ఉందని లోకేష్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము పోరాడతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement