Saturday, April 27, 2024

కరోనాతో టీడీపీ సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు కన్నుమూత

కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకుంది. టీడీపీ సీనియర్ నేత, తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బొడ్డు భాస్కర రామారావు (72) కరోనాతో పోరాడుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ సంక్రమించడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1994, 2004లో పెద్దాపురం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన రామారావు ఎమ్మెల్సీగానూ పనిచేశారు. పెదపూడి మండలంలోని పెద్దాడకు చెందిన ఆయన అంతకుముందు అంటే 1982లో సామర్లకోట సమితి అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. ఆ తర్వాత 1984లో జడ్పీ చైర్మన్‌గా సేవలు అందించారు. కాగా రామారావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement