Wednesday, March 27, 2024

తిరుపతిలో ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

తిరుపతి -: తిరుపతి (ఎస్.సి) పార్లమెంటరీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినది.. ఆదివారం తిరుపతి (ఎస్ సి) పార్లమెంటరీ ఉప ఎన్నిక కౌంటింగ్ లో భాగంగా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్ లను జనరల్ అబ్జర్వర్ దినేష్ పటేల్,కౌంటింగ్ అబ్జ ర్వర్, రాజేంద్ర కుమార్ పట్నాయక్ ల సమక్షం లో తెరచి ఈ విఎం ల ను కౌంటింగ్ హాల్స్ కు తరలించారు… తిరుపతి, సత్యవేడు శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రారంభ మైన కౌంటింగ్ ప్రక్రియ… ఈ ప్రక్రియను పర్యవేక్షి స్తున్న జనరల్ అబ్జర్వర్ దినేష్ పటేల్, కౌంటింగ్ అబ్జర్వర్ రాజేంద్ర కుమార్ పట్నాయక్, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ యం.హరి నారాయ ణన్,తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, తిరుపతి నగరపాలక సంస్థ కమి షనర్ గిరీష, తిరుపతి ఆర్డిఓ కనకనర్సారెడ్డి … తిరుపతి శ్రీకాళహస్తి, సత్యవేడు ఏ ఆర్ వో లు చంద్రమౌళిశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, చంద్ర శేఖర్ లు కౌంటింగ్ ప్రక్రియ ను పరిశీలిస్తు న్నారు… కొవిడ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ప్రతి కౌంటింగ్ హాల్ లో కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నది..

Advertisement

తాజా వార్తలు

Advertisement