గుంటూరు నుంచి వచ్చిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేశారు.ఈ ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. టాయ్ లెట్ కు వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ తమిళనాడు భక్తులను గుంటూరు భక్తులు కోరారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాటతో ప్రారంభమైన ఘర్షణ చివరకు క్యూ లైన్లోనే కొట్టుకునేంత వరకు వెళ్లింది. పక్కనున్న వారు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ తమిళనాడు వాళ్లు ఆగలేదు. ఈ గొడవలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement