Sunday, April 28, 2024

పేదల హృదయాల్లో సీఎం జగన్ కు చెరగని స్థానం… ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : పేదల హృదయాల్లో సీఎం జగన్ చెరగని స్థానం సంపాదించుకున్నారని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలో కొత్త నాటకాలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం 48వ డివిజన్ లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య, వీధిలైట్ల సమస్య, ఇళ్ల స్థలాలు ఇలా సమస్యలు చెప్పడంతో సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటు పడుతోoదన్నారు. ఆరోగ్యం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో మరికొన్ని లక్షలాది మందికి ఉద్యోగం కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ అన్నా సంధ్య, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, డీఈ విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు మురళి, రఫీ, సురేందర్ రెడ్డి, రమణ, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement