దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పోలిస్తే చాలా వరకు కరోనా పాజిటివిటి రేట్ తగ్గింది. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 2,76,125 నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,16,394కు చేరింది. 27,374 కేసులు యాక్టివ్గాఉన్నాయి. నిన్న కరోనా నుంచి 2,654 మంది కోలుకున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,28,822 మంది మరణించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement