Tuesday, July 23, 2024

RR: నితిన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శంక‌ర్..

కేశంపేట మండల పరిధిలోని పుట్టొనిగూడ గ్రామపంచాయతీ కంకిరాల తాండకు చెందిన మూడవత్ నితిన్ (18) గ్రామ సమీపంలోని క్వారీలో శనివారం ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ మృతదేహాన్ని వెలికి తీయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపి బాలుడి శవాన్ని వెలికి తీశారు.

బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత పాలకులు ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా క్యారీలు నిర్వహించే విధంగా వెస‌లుబాటు కల్పించడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపైన సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement