Friday, April 26, 2024

రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇది దుర్ధినం..నాగ‌బాబు..

వైసీపీపై మండిప‌డ్డారు న‌టుడు నాగ‌బాబు..రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఇది దుర్దిన‌మ‌ని తెలిపారు. ఎంతో ఉన్నతమైనదిగా, ఉత్తమమైనదిగా ప్రాచుర్యం పొందిన మన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తలచుకుని బాధపడాలో లేక భయపడాలో తెలియని సందిగ్ధ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయి ఉండొచ్చని… టీడీపీ తమకు ప్రతిపక్షం అయ్యుండొచ్చని… కానీ, చంద్రబాబు వంటి ఒక నేత ఇలా కన్నీటిపర్యంతం అయిన ఘటన తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకి పరాకాష్టలకు నిలయంగా మారుతోందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని ‘భో…కె’ అని దూషించి, ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో కించపరిచి… తమను తాము హీనాతిహీనమైన విలువలు లేని పురుగులుగా నాయకులు నిరూపించుకుంటున్నారని నాగబాబు దుయ్యబట్టారు. నీకు ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప… వారిని తిట్టడం లేదా దూషించే అధికారం ఏమాత్రం లేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement