Friday, May 3, 2024

నిజాంపేట్ 20వ డివిజ‌న్ లో పట్టణ ప్రగతి – ప్రజల గోస

మేడ్చల్ జిల్లా రూరల్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ లో పట్టణ ప్రగతి – ప్రజల గోస కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా రూరల్ గిరిజన మోర్చా బీజేపీ అధ్యక్షులు రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ఉదయం 7:30 గంట‌ల‌కు నిజాంపేట్ కార్పొరేషన్ 20వ‌ డివిజన్ లో ప్రజా మౌలిక వసతుల పరిశీలన, సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర యాత్ర నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వడ్లమూడి సులోచన, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్, రాష్ట్ర మైనారిటీ మోర్చా అడ్డాల మల్లేశ్వరి, రాష్ట్ర ఎస్సీ మోర్చ కో కన్వీనర్ దాసి నాగరాజు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంద‌రూ, బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement