Friday, May 24, 2024

వరినాట్లు వేస్తున్న నలుగురు మహిళలను కాటేసిన పాము..

మహబూబాబాద్‌, ప్రభన్యూస్‌ ప్రతినిథి: పొలంలో వరినాట్లు వేస్తున్న నలుగురు మహిళలు త్రాచుపాము కాటుకు గురైన సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని మహబూబాబాద్‌ మండలం అమనగల్‌ గ్రామ కస్నాతండా శివారులో పొలం పనులు చేస్తున్న అనిత, బుజ్జి, లూనావత్‌ స్వరూప, లూనావత్‌ సునీత అనే నలుగురు మహిళలను త్రాచుపాము కాటువేయడంతో

వారు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. పనిచేసే తోటి వారు హుటాహుటిన చికిత్స నిమిత్తం వారిని మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పాముకాటు ప్రభావం ఎలా ఉంటుందో 24 గంటలు గడిస్తేకానీ చెప్పలేమని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో పాముకాటుకు గురైన మహిళల కుటుంబాలు ఆందోళన పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement