Saturday, April 27, 2024

కాస్త ఆలస్యంగానే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌, టీఎస్‌పీఎస్సీ నుంచి నెక్ట్స్‌ నోటిఫికేషన్‌ ఇదే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ (తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నుంచి మరో నోటిఫికేషన్‌ వెలువడనుంది. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ వెలువరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్‌సీ మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈక్రమంలోనే త్వరలోనే అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ 149 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీని తర్వాత గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది.

ఆయా శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. కొన్ని విభాగాల్లోని పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లబించినట్లుగా తెలిసింది. గ్రూప్‌-4లో దాదాపు 9వేలకు పైగా ఖాళీలున్నాయి. వీటన్నింటికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించి, క్లియరెన్స్‌ జీవోలు విడుదలైన తర్వాతే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అయితే ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ వర్గాలు పేర్కొంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement